కృష్ణా: గుడివాడ టిట్కో కాలనీకి మల్లేశ్వరరావు కుమారుడు అందే నాగ సతీష్ కుమార్ గత 3 నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఏలూరులో చికిత్స పొందుతున్నాడు. తలనొప్పి ఎక్కువగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో సతీష్ అపార్ట్మెంట్పై అంతస్తు నుంచి కిందకు దూకాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బుధవారం వైద్యులు నిర్ధారించారు.