ADB: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ‘లెర్న్ స్మార్ట్ విత్ AI’ కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. బుధవారం ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ, ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ సంయుక్తంగా ఈ శిక్షణను చేపట్టాయి. కృత్రిమ మేధతో విద్యాబోధన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు.