MNCL: పదవ తరగతి విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావద్దని పీఎంశ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ అన్నారు. బుధవారం భీమారంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో, పరీక్ష రోజు ఎలా చదవాలో జ్ఞాపకశక్తి పెంచుకునే పద్ధతులను నేర్పించారు.