విశాఖలోని తవ్వావానిపాలెంలో నిర్వహించిన ‘శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మతల్లి’ పండుగ మహోత్సవంలో మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అన్నంరెడ్డి అదీప్ రాజ్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన ఎడ్లబండి పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.