ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మహారాష్ట్రలో రెండో రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సుప్రసిద్ధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లోరా సమీపంలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ స్వామిని దర్శించుకున్నారు. పర్యటన ఆద్యంతం ఆధ్యాత్మికంగా సాగింది.