AKP: మాడుగులలో అగ్నిమాపక అధికారి వీ. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిని నియంత్రించడం, తమతో పాటు ఇతరులను రక్షించడంపై డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.