NLG: దేవరకొండ ఆర్టీసీ వెల్ఫేర్ కమిటీ మెంబర్ పాపారాజు, కార్మికులు కలిసి వారి సమస్యల గురించి ఎమ్మెల్సీ కోదండరామ్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికుల తరుపున సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పూర్తి స్థాయిలో వారి సమస్యలను విని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.