సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ఏపీ రాష్ట్ర రజక సంఘం ఆధ్వర్యంలో రజకులకు ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రయోజన పథకం కింద దాదాపు 50 వాషింగ్ మిషన్లు బుధవారం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రజకుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని నాయకులు తెలిపారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.