NRML: ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం గణితం 2, జంతు శాస్త్రం 2, చరిత్ర, 2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 5677 మంది విద్యార్థులకు గాను 5534 మంది పరీక్ష రాశారని 143 మంది గైర్హాజరయ్యారని వారు పేర్కొన్నారు.