BHPL: కాటారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతాపగిరి పాఠశాలలో బాలుర మరుగుదొడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా అధికారుల స్పందించాలన్నారు.