PLD: రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామంలో “స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా చెరువుల ప్రక్షాళన, పునరుద్ధరణ పనులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు హాజరయ్యారు. గ్రామంలోని చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే, శుభ్రత మరియు పునరుద్ధరణ పనులు నిర్లక్ష్యం లేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.