సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం CM చంద్రబాబు నాయుడును కోరారు. నియోజకవర్గంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని, హంద్రీనీవా కృష్ణా జలాలతో చెరువులు నింపాలని విన్నవించారు. పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.