MBNR: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనునట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పరీక్షల కోసం జిల్లాలో మొత్తంగా 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో 20 ప్రభుత్వ కళాశాలలు కాగా 15 ప్రైవేట్ కళాశాలలన్నారు. 10859 ఇంటర్ మొదటి సంవత్సరం, 11025 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాయబోతున్నారన్నారు.