NLR: పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా కోవూరు నియోజకవర్గంలో రూ. 86 కోట్లతో సౌర విద్యుత్ సేవలు అందించనున్నట్లు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. మంగళవారం కోవూరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ పేదలకు 7469 సౌర యూనిట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. సోలార్ వినియోగం వల్ల గ్రీన్ ఎనర్జీ పెంపొందుతుందన్నారు.