JGL: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు జగిత్యాల జిల్లాలో మొత్తం 30 పరీక్ష కేంద్రాల్లో 15123 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు రాజగౌడ్, లత, ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని స్పష్టం చేశారు.