AKP: మాకవరపాలెం మండలం బూరుగుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్ధులు లిఖిత, జ్యోతి, కార్తీక్, కోమల్ అండర్-14 బేస్ బాల్ బాలబాలికల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మే నెల ఐదో తారీకు నుంచి కర్నూలులో మొదలు కాబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొంటారు. పాఠశాల హెచ్ఎం మహాలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ రాజబాబు అభినందించారు.