KNR: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు తొంగిచూస్తాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో జరిగిన తమ్మనవేణి మల్లమ్మ, పుట్ట స్వరూప, పుత్లీ బేగం ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.