KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆత్మకూరి నవీన్ కుమార్ అనారోగ్యంతో చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో రూ.75,000 ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైంది. శనివారం ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను బాధిత కుటుంబానికి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు ఈ సాయం ఎంతో ఊరటనిచ్చిందని నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.