NZB: జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి కోరారు. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీస్ కమీషనర్ సాయి చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. నగరంలోని మిర్చి కాంపౌండ్, తదితర ప్రాంతాల్లో అమాయక ప్రజలపై జరుగుతున్న దాడులపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.