NTR: ఇటీవల ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన జోగి రమేష్ నివాసాన్ని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ఈ ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.