దుబాయ్ వేదికగా అల్లు శిరీష్ ఇచ్చిన పార్టీకి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో హాజరవ్వడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై శిరీష్ స్పందిస్తూ.. ‘చరణ్ పార్టీ మొదలవ్వక ముందే వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించి వెంటనే వెళ్లిపోయారు. అక్కడ మద్యం లేదు, అపచారం జరగలేదు. ఆయన భక్తిని ఎవరూ వేలెత్తి చూపలేరు’ అని ఘాటుగా బదులిచ్చాడు. విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికాడు.