KMR: లింగంపేట్ మండలం భవానీపేట (తండా)లో నిర్మిస్తున్న జగదాంబ, సేవాలాల్ ఆలయ నిర్మాణానికి భవానీపేట గ్రామ సర్పంచ్ ఆకుల సురేందర్ రూ. 50,000 భారీ విరాళాన్ని తండా వాసులకు అందజేశారు. ఈ మేరకు తండా ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అక్కుల సాయిలు, చందర్ నాయక్, రూప్ సింగ్, ధన్ రాజ్, సరిచంద్, వార్డు మెంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.