SDPT: కోహెడ మండలంలో వేరుశనగ పంట ఫీల్డ్ ఎంపిక కార్యక్రమాన్ని ఏఎస్వో చామంతి నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో పంట చేనులను పరిశీలించి వేరుశనగ పంట స్థితిగతులను అధ్యయనం చేశారు. రైతులకు సాగు విధానాలు, తెగుళ్ల నివారణ చర్యలు, దిగుబడి పెంపు మార్గాలపై సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటల ఎంపిక, నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులకు సూచించారు.