MDK: కొల్చారం మండలం పైతర, తుక్కాపూర్ శివారుల్లో మంజీరా ఇసుక దోపిడీ బహిరంగంగా సాగుతోంది. ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, తక్షణమే ఈ దందాను అరికట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.