AKP: నాతవరం మండలం లింగంపేట గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని తమ సొంత భూమిగా చూపిస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటనలో కేసు నమోదు చేశామని సీఐ రేవతమ్మ తెలిపారు. కోటవురట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు రెవెన్యూ, పంచాయతీ అధికారుల విచారణలో వెల్లడైందన్నారు. ఆరుగురిని అరెస్టు చేశామన్నారు.