కోనసీమ:కె.గంగవరం మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దాళ్వా, వరిచేలు నేలకొరిగాయి. కోతలు ప్రారంభమయ్యే తరుణంలో ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నేలపాలవ్వడంతో పెట్టుబడి వ్యయం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.