KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించిన వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 267 కేసులు నమోదు చేసి రూ.57,900 జరిమానాలు విధించారు. పోలీసులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.