NDL: వెలగపూడి క్యాంప్ కార్యాలయంలో హెచ్ఆర్డీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక ప్రసాద కిట్ను ఎమ్మెల్యే లోకేష్కు అందజేశారు.