KNR: క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు మార్చి 1 నుంచి 7 వరకు ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. మార్చి 1-3 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రాథమిక పోటీలు, 5-7 తేదీల్లో KNR కేంద్రంలో ఫైనల్స్ ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 25 నుంచి 27 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.