NTR: నందిగామ మండలం ఐతవరం నేషనల్ హైవే 65పై శనివారం తెల్లవారుజామున వాల్వ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతుడు చందర్లపాడు మండలం తోటరావులపాడుకు చెందిన స్వామిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వోల్వా బస్సు వేగంగా ఢీకొట్టడంతో అక్కడకక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.