KDP: చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజంపేట TDP ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. శనివారం మాధవరం-1 సచివాలయంలో చేనేతలకు ఉచిత విద్యుత్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు చమర్తి మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్లను కూటమి ప్రభుత్వం అందించడం హర్షనీయమన్నారు.