BPT: బల్లికురవ మండలం వైదన గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. పిడుగురాళ్ల నుంచి అద్దంకి వైపు వెళ్తున్న ఓ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై, టోల్ప్లాజా అంబులెన్స్లో క్షతగాత్రుడిని అద్దంకి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.