GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం మైనారిటీల సంక్షేమంపై ఆయన గళమెత్తారు. కూటమి ప్రభుత్వం మైనారిటీలకు కేటాయించిన నిధుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, క్షేత్రస్థాయిలో ముస్లిం మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.