CTR: చిత్తూరు గంగినేని పార్క్ వద్ద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ శుక్రవారం ప్రారంభించారు. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా పాదాచారులు, ప్రయాణికుల దాహార్తి తీర్చేలా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన తెలియజేశారు. అనంతరం పలువురికి పండ్లను పంపిణీ చేశారు.