హన్మకొండ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో దొడ్డి కొమురయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి రిజిస్ట్రార్ రామచంద్రం, పాలకమండలి సభ్యుడు రాజు గౌడ్, అధ్యాపకులు పూలమాల వేసి నివాళులర్పించారు. బానిస సంకెళ్లు తెంచుకోవడానికి ప్రాణాలను అర్పించిన మహావీరుడు దొడ్డి కొమురయ్య అని రాజు గౌడ్ పేర్కొన్నారు.