RR: చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో సోమవారం సర్పంచ్ మల్లారెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా, పెండింగ్ బిల్లు, తదితర అంశాలపై చర్చించారు. గ్రామంలోని పని చేయని సీసీ కెమెరాలు రిపేర్ చేయించి వాటిని ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్మికులకు యూనిఫామ్ అందజేసి వారిని సన్మానించారు.