BHPL: కుమ్మెర జాతరలో బీసీ రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం తెలంగాణ చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని BHPL జిల్లా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఇవాళ BHPL జిల్లా కేంద్రంలో కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. BCలకు కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.