MP సాగర్ జిల్లాకు చెందిన రాజేంద్ర(22)-కాజల్ పటేల్(21) దంపతులు పెళ్లి బట్టలు ధరించి సూసైడ్ చేసుకున్నారు. ప్రస్తుతం కాజల్ గర్భవతి కాగా.. ఇద్దరూ రాత్రి భోజనం చేశాక బలవన్మరణానికి పాల్పడ్డారు. మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. సూసైడ్ లెటర్ కూడా రాయకుండా చనిపోయేంత కష్టం ఏం వచ్చిందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.