NLG: చిట్యాల నుంచి ఉరుమడ్ల, నేరడ దారుల్లో, పెద్దకాపర్తి లోకి వెళ్లే దారిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటిన హరితహారం వృక్షాలను గుర్తుతెలియని వ్యక్తులు మొండెం వరకు నరికివేశారు. ఏళ్ల తరబడి పెంచిన చెట్లను ఇలా నిర్దాక్షిణ్యంగా రంపంతో కోయడం పట్ల పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.