PDPL: జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. సంబంధిత అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమీక్షించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లోని అభివృద్ధి పనులు, మంథనిలో స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించాలని, పెద్దపల్లి, మంథని బీటీ రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.