TPT: నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను, ఖాళీ జాగా పన్నుల బకాయిలపై వడ్డీకి 50 శాతం రాయితీ పొందేందుకు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. బకాయిలను ఒకేసారి చెల్లించిన యజమానులు ఈ రాయితీ పొందవచ్చని పేర్కొన్నారు. గృహ యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిలను చెల్లించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.