WNP: పదవీ విరమణ పొందిన అధికారులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పశువైద్యాధికారి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో రవీంద్రబాబు, జెడి సీపీవో వెంకటరమణ దంపతులను వారి నివాసాల్లో శాలువాతో గౌరవించారు. వారి సేవలను ప్రశంసిస్తూ, విశ్రాంత జీవనం సుఖసంతోషాలతో గడవాలని నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు.