శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ తరగతులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తిరిగి ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండగా జూన్ 1 నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 160కి పైగా కళాశాలల్లో సుమారు 19వేల మంది హాజరుకానున్నారు.