ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు తెల్లవారుజామున హైదరాబాద్ వస్తుంది. ఆ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న వారందరూ ఎంచక్కా నిద్రపోతున్నారు. అంతే అదే క్రమంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందులోనే ఉండగా..అతను మంటల్లోనే కాలిపోయాడు.
గాజాలో మరోసారి మారణహోమం ప్రారంభమైంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో నేడు ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. ఈ మారణహోమంలో 178 మంది దుర్మరణం చెందారు.
సలార్ ట్రైలర్ విడుదలైంది. డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అద్భుతమైన డైలాగ్స్, మ్యూజిక్, ఫైట్ సీన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
ఓ వ్యక్తి ఆవుపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన సంఘటన తెలంగాణలోని నిర్మల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓటు వేసే ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గోపూజ చేశారు. అలాగే మరో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గ్యాస్ సిలిండర్కు పూజ చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(allola indrakaran reddy) ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. ఏకంగా పార్టీ కండువా కప్పుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అయితే ఈ సంఘటనపై ఈసీ చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్లోని పోలింగ్ బూత్లో కవిత తన ఓటు వేసిన తర్వాత తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసింది.
నటి ప్రగతి నేషనల్ లెవర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు. ఈ విషయాన్ని ఆమె చెబుతూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోకు నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎదురింటి వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులను కర్ర చూపించి, పరుగెత్తించింది ఓ మహిళ. ఈ ఘటన హర్యానాలో గల భివానీలో జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేతలు మంగళవారం రాత్రి ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఉత్తరకాశీలోని టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తోంది. ఒక్కొక్కరినే టన్నెల్ లో అమర్చిన సేఫ్ పైప్ లైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. వచ్చిన వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. 17 రోజుల తర్వాత కార్మికులు టన్నెల్ నుంచి బయటకు రావడంతో కుటుంబీకుల్లో ఆనందం నెలకొంది.
అత్యంత ఖరీదైన పెళ్లి చేసుకొని ఒక జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను వధువు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.
మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి రూ.వెయ్యి కోట్ల సంపాదించారని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ విమర్శలు చేశారు. త్రిష ఇష్యూలో పరువు నష్టం దావా కూడా వేస్తానని స్పష్టంచేశారు.
రద్దీ రైలులో ఓ కంటెంట్ క్రియేటర్ జోరుగా స్టెప్పులు వేసింది. స్నేహితురాలు కూడా తోడై.. ఇద్దరు చక్కగా డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.