లోక్సభలో స్మోక్గ్యాస్ చల్లి భయాందోళనలు సృష్టించిన నిందితులను పట్టుకున్న ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలోని ఆస్పత్రిలోకి చిరుతపులి ప్రవేశించడంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందారు. షాహదా పట్టణంలోని డోంగర్గావ్ రోడ్డులో ఉన్న ఆదిత్య ప్రసూతి, కంటి ఆసుపత్రిలోకి చిరుత చేరడంతో అక్కడకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ముంబై మెట్రోలో ఓ యువతి డ్యాన్స్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్కి తగిలింది. అతను సరదాగా ఉండటంతో మరోసారి కాలు కదిపింది. ఈ సారి అతను కూడా డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
క్రికెట్ లోకంలో విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం 'గూగుల్' తన మొత్తం 25 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా శోధించిన జాబితాను విడుదల చేసి కీలక విషయం తెలిపింది. క్రికెటర్ల విషయానికి వస్తే కోహ్లీ పేరు అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించింది.
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ నటించిన తాజా చిత్రం బుట్ కట్ బాలరాజు నుంచి మేకర్స్ టీజర్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అమ్మాయిలు నువ్వనుకుంత మంచివాళ్లు కాదురా అనే డైలాగ్ ఆసక్తి రేపుతోంది.
ఓ మహిళ పిలవగానే సీఎం పలికారు. అంతటితో ఆగలేదు. ఆమె సమస్యను తెలుసుకుని..వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ దృశ్యం నిన్న తెలంగాణలోని హైదారాబాద్లో చోటుచేసుకోగా..ఈ వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి చిన్న కుక్కపిల్ల పట్ల అత్యంత కర్కషంగా వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన చిన్న కుక్కపిల్లను నేలపై విసిరి క్రూరంగా చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర మంత్రితోపాటు సీఎం కూడా స్పందించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం నా సామి రంగ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమిగోస్ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు విద్యార్థినులతో ఉన్న నిండు సభలో అవమానం జరిగింది. అవును ఓ స్కీం గురించి విద్యార్థులను సీఎం ప్రశ్నించగా..తమకు రాలేదని విద్యార్థినులు ముక్తకంఠంతో చెప్పారు. దీంతో సీఎం హేమంత్ సోరెన్ షాకై ప్రసంగం ఆపి వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. వైద్యుల సమక్షంలో ఆయన నడవడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుల్లెట్ ట్రైన్ రైల్వేస్టేషన్ వీడియోను షేర్ చేశారు. అది రైల్వేస్టేషనా..? లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టా అనే సందేహాం కలుగుతోంది.
శీతాకాలంలో చలి నుంచి దేవుళ్లను రక్షించడానికి భక్తులు వెచ్చని దుస్తులతో అలంకరించారు. దేవుళ్ల విగ్రహాలకు స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలతో అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన ఈఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే. అతను విధించే శిక్షల గురించి నెట్టింట్లో కథనాలు వస్తాయి. అలాంటి వ్యక్తి ఒక సభలో కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రరాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న వరదల కారణంగా రహదారులు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.