హనుమాన్ మూవీని చూస్తూ ఓ మహిళ అసహజంగా ప్రవర్తించింది. తన ప్రవర్తనకు ముందు హడలిపోయిన ప్రేక్షకులు తరువాత అర్థం చేసుకున్నారు. క్లైమాక్స్లో హనుమంతుడు వచ్చే సీన్కే సదరు మహిళ అలా చేసిందని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్గా మారింది.
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. సాయిపల్లవి ఏ మూవీలో నటిస్తే.. ఆ మూవీ పక్కా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. కాగా.. ఆమె వరస సినిమాలతో బిజీగా ఉండగా.. రీసెంట్ గా ఆమె చెల్లెలు మాత్రం పెళ్లికి రెరడీ అయ్యింది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే.. ఆ ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ప్లాట్ఫాంపై నిలిచి ఉన్న ట్రైన్లో కిటికీ బయటనుంచి మొబైల్ను దొంగలించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తం అయిన ప్రయాణికుడు దొంగ చేయి పట్టుకున్నాడు. ట్రైన్ కదిలింది. మిగితావారు కూడా అతని చేయిపట్టుకొని తలపై మొట్టికాయలు వేశారు. ఒక కిలోమీటర్ మేర అతన్ని కిటికీకే వేళాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇండియన్ రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. రోజుకు లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. చాలా మంది ప్లాట్ ఫామ్స్లో దొరికే ఆహారాన్ని, అలాగే ట్రైన్లలో అమ్మె ఆహారాన్ని తింటుంటారు. మరి వాటి శుభ్రత ప్రమాణాలు ఎలా ఉంటాయో తెలిసిందే. తాజాగా ఐఆర్సీటీసీ ఫుడ్ స్టాల్స్లో ఎలుకలు తిరగే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తమిళ హీరో ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయింది. రియల్ ఇన్స్డెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రక్తపాతం అయితే ఫుల్గా ఉంది.
ఫ్లై అవుతున్న విమానంలో ఓ యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. మెట్రోల్లో, రైళ్లలో యువతియువకులకు హద్దులు లేకుండా పోయాయి.
దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధనల మార్పుల వల్ల ట్రక్కు డ్రైవర్లు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పలు నగరాల్లో పెట్రోల్ బంక్ల వద్ద జనాలు బారులు తీరారు. దీంతో ఓ డెలివరీ బాయ్ గుర్రం మీద ఫుడ్ డెలివరీ చేశాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అక్కినేని నాగార్జున, అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
విమానాన్ని ట్రక్కుపై తీసుకెళ్తుండగా ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. దాంతో జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగి.. సీట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సీట్లకోసం మహిళలు దారుణంగా కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రెజ్లర్ భజరంగ్ పునియా ఢిల్లీలో తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్న వీడియోను భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ షేర్ చేశారు. ఆ వీడియోను చూస్తుంటే హృదయం ముక్కలవుతోందని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
వరదల నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వరద తగ్గే వరకు ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.