• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతు మృతి

MDK: మాసాయిపేట మండలం బొమ్మారంకు చెందిన మెట్టెల నాగరాజు (25) ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిన్న రైల్వే ట్రాక్ పనులకు వాటర్ సప్లయ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ట్రాక్టర్ ట్యాంకరు బోల్తాపడగా నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.

February 26, 2026 / 07:15 PM IST

తార్నాకలో మల్కాజ్‌గిరి ఆఫీస్.. పరిష్కారానికి ఇక్కడికి రండి

MDCL: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ ప్రాంతాలు వస్తాయి. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం తార్నాకలోని HMDA భవనంలో అందుబాటులో ఉంది. కమిషనర్ అధికారి, ఇతర అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. కిందిస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే డైరెక్ట్ కమిషనర్ కార్యాలయానికి రావాలన్నారు.

February 26, 2026 / 07:13 PM IST

గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

February 26, 2026 / 07:12 PM IST

గోదావరి పుష్కరాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

MNCL: గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గోదావరి నది తీర ప్రాంతాలలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు కార్యచరణ సిద్ధం చేయాలన్నారు.

February 26, 2026 / 07:07 PM IST

సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు

MDK: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి పేర్కొన్నారు. మాసాయిపేట మండలానికి మంజూరైన మూడు స్పేయర్లు, మూడు రోటవేటర్‌లను మండల వ్యవసాయధికారి కవితతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం వ్యవసాయం ప్రోత్సహించడానికి సబ్సిడీ పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు.

February 26, 2026 / 07:07 PM IST

పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం: జూకంటి బాబు

BHNG: పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జూకంటి బాబు ఫౌండేషన్ అధ్యక్షులు జూకంటి బాబు తెలిపారు. గురువారం ఆలేరు మండలం టంగుటూరు గ్రామం ఎలగందుల రాజ్యలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నాలుగు ఆకర్షణీయమైన రంగులతో కూడిన యూనిఫామ్‌లను ఆయన అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

February 26, 2026 / 07:05 PM IST

శాంతి భద్రతల పరిరక్షణలో SI పాత్ర కీలకం: SP

ADB: శాంతి భద్రతల పరిరక్షణలో రూరల్ SI విష్ణువర్ధన్ పాత్ర కీలకం అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, క్రీడారంగంలో అభివృద్ధి చెందడానికి విష్ణువర్ధన్ సేవలు మరువలేనివని అన్నారు. ఈ మేరకు మహిళా క్రీడాకారులకు ఆర్చరీ కిట్లు, ఎనిమిది మంది క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ SP అఖిల్ మహాజన్ చేతుల మీదుగా గురువారం అందజేశారు.

February 26, 2026 / 07:02 PM IST

గరికపాటి ప్రవచనం.. అధిక సంఖ్యలో భక్తజనం

PDPL: పెద్దపల్లి జిల్లా మంథనిలో శకుంతలోపాఖ్యానం ప్రవచనాలకు విశేష స్పందన లభిస్తోంది. వివిధ మండలాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. గరికిపాటి ప్రవచనాలు వినేందుకు తొలిరోజు వేసిన 2500 కుర్చీలు సరిపోలక, రెండో రోజు 600 అదనంగా ఏర్పాటు చేశారు. గురువారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.

February 26, 2026 / 06:58 PM IST

‘ప్రతి విద్యార్థి బ్రాండ్ అంబాసిడర్ కావాలి’

MDK: ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలని జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ‘Arrive-Alive’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత చేపట్టినట్టు వివరించారు.

February 26, 2026 / 06:58 PM IST

​కోర్టు వాయిదాలకు డుమ్మా.. జైలుకు నిందితుడు

SRPT: రెండు కేసుల్లో కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న చివ్వెంల మండలం ఆయిలపురం గ్రామ నివాసి చేర్కుపల్లి సైదులును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సూర్యాపేట కోర్టు ఇతనిపై NBW జారీ చేయడంతో నిందితుడిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

February 26, 2026 / 06:52 PM IST

బాటసింగారం మార్కెట్‌లో తోతాపురి మామిడి రాక

RR: బాటసింగారం మార్కెట్‌లో తోతాపురి రకానికి చెందిన మామిడికాయలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. రుచితో పాటు, ఎగుమతులకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రకానికి భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, 2025 సంవత్సరంలో మామిడి విక్రయాల ద్వారా మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. దీంతో రైతులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 06:50 PM IST

ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన సీఎం సోదరుడు

NGKL: వెల్దండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి, MLA కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై గురువారం ఇంటిని ప్రారంభించారు. MLA మాట్లాడుతూ..అర్హులైన పేదవాడికి గృహ నిర్మాణ పథకం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.

February 26, 2026 / 06:50 PM IST

‘జిల్లాలో 195 అబాండెడ్ వాహనాలు.. 6 నెలల్లో క్లెయిమ్ చేయాలి’

కామారెడ్డి జిల్లాలో 195 అబాండెడ్ వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ప్రకటించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 26 ప్రకారం ఈ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన యజమానులకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకోవడానికి ఆరు నెలల గడువు ఉంటుందని, ఈలోపు క్లెయిమ్ చేసుకోకపోతే బహిరంగ వేలం వేస్తామని ఆయన పేర్కొన్నారు.

February 26, 2026 / 06:50 PM IST

సీతారాముల దేవస్థానానికి ఛైర్మన్‌గా మారం మీనారెడ్డి

నల్గొండ: కేతపల్లి మండలం బండపాలెం గ్రామంలోని శ్రీ సీతారాముల స్వామి దేవస్థానానికి నూతన ఛైర్మన్‌గా మారం మీనారెడ్డిని ఎమ్మెల్యే వేముల వీరేశంను ఏకగ్రీవంగా నియమించారు. మార్చిలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తానని మీనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.శ్రీనివాస్, సర్పంచ్ పెండ్యాల శ్రీనివాసరావు, వి.రాము, కోటిరెడ్డి, సురేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 06:48 PM IST

గుర్రపు డెక్క తొలగింపు పనుల పర్యవేక్షణ

MDCL: పీర్జాదిగూడ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పర్యవేక్షించారు. గుర్రపు డెక్క వెంట వెంటనే తొలగించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ని ఆయన ఆదేశించారు. గుర్రపు డెక్కల వలన దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు.

February 26, 2026 / 06:44 PM IST