SRD: సిర్గాపూర్ మండలం వంగదాల్కు చెందిన సుభాష్ (35) సూసైడ్ చేసుకున్నాడని ఎస్సై మహేష్ నేడు తెలిపారు. సుభాష్ తన సోదరుడు ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి నిర్మాణం కోసం సోదరుడు ఇంట్లో ఉంచిన డబ్బు, బంగారం కనిపించలేదు. ఈ నేరం తనపైనే వస్తుందని అనుమానంతో సుభాష్ గ్రామ శివారులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం ఆయన ఇటిక్యాల మండలం వావిలాలకు నిన్న లిఖిత ఆపరేషన్ కోసం కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల విలువగల LOC ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు.
KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితుల సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో 22 మంది తహశీల్దార్లు విచారణ చేపట్టారు. మొత్తం 600 మందిలో కేవలం 180 మందే స్థానికులు కాగా, మిగిలిన 420 కుటుంబాలు కొంతమంది ఇతర జిల్లాలు, మరికొంత మంది ఏపీకి చెందినవారని తేలింది.
ADB: జంధాపూర్ గ్రామ ప్రజల చిరకాల కోరికైన స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రధాన రహదారిపై వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి వేగ నియంత్రకాలు ఏర్పాటు చేసి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు.
HYD: తార్నాక, నారాయణగూడ ప్రాంతాల్లో న్యాచురల్ గ్యాస్ కోసం కార్ల క్యూ లైన్లు కనిపించాయి. సీఎన్జీ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సరఫరా లోపం కారణంగా వాహనాలు పెద్ద ఎత్తున వరుసగా నిలిచిపోయాయి. ఉద్యోగాలు, కార్యాలయాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికారులు సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలన్నారు.
NRPT: ఈనెల 3న మంగళవారం హోలీ పండుగను నిర్వహించుకోవాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, కానుగంటి వెంకటేష్, కుమ్మరి రాజులు తెలిపారు. సోమవారం రాత్రి కామ దహనాన్ని నిర్వహించి మంగళవారం హిందూ సోదరులు హోలీ పండుగను ప్రకృతి సిద్ధమైన రంగులతో నిర్వహించుకోవాలని కోరారు.
BHPL: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష(AISSEE) ఫలితాల్లో చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం గౌతమ్ సత్తా చాటారు. 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పరీక్షలో గౌతమ్ రికార్డు స్థాయి ర్యాంకులతో జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాదించాడు.
HYDలోని పలు ప్రాంతాల్లో కలుషిత నీటి సరఫరా కలకలం రేపుతోంది. బాగ్లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం,సైబర్ హుడ్ కాలనీ వంటి చోట్ల తాగునీటిలో డ్రైనేజీనీరు కలిసి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాపుల్లో మురుగు వాసనతో కూడిన నల్లటి నీరు వస్తుండటంతో ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.
ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల పేరుతో సుమారు 600 పేదల ఇళ్లను కూల్చి వేసిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు మేరకు కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కమిషన్ ఆదేశించినట్లు సమాచారం.
నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్ కోర్సు మార్చి 4 నుంచి ప్రారంభంకానుంది. 8వ తరగతి పాసై, 18-35 ఏళ్ల లోపు ఉన్న మహిళలు దీనికి అర్హులు. ఆసక్తి గలవారు విద్యా అర్హత సర్టిఫికేట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ప్రాంగణాన్ని సంప్రదించాలని మేనేజర్ అనిత తెలిపారు.
మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని 10 ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిషిప్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. గ్యారేజ్, ఆపరేషన్ విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. 2021 తర్వాత ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్, డిప్లమా, అలాగే BA, BCom, BSc పట్టభద్రులు NATS వెబ్సైట్లో ఈ నెల 16లోగా దరఖాస్తు చేయాలని సూచించారు.
SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల మార్చ్ 1వ తేది నుంచి 31 వరకు పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు చేయరాదన్నారు.
SRPT: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని బెదిరించి బంగారం దోచుకెళ్లిన ఘటన నడిగూడెంలో శనివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన అనసూర్యమ్మ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, ఆమెను బెదిరించి మెడలోని 10 గ్రాముల నల్లపూసల తాడు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు ఎస్సై అజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
NLG: ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరులు పొన్నాల సురేంద్ర, దామోదర్, మహేష్, భారతిల చిత్రపటాలకు చిట్యాలలో ఎమ్మార్పీఎస్ నేతలు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేస్తున్నాయని, ఇప్పటికైనా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని ఎరసాని గోపాల్, మేడి శంకర్ డిమాండ్ చేశారు.