SRPT: మోతె మండల కేంద్రంలోని తిరుపతమ్మగోపయ్య స్వామి ఆలయంలో సోమవారం ఉదయం కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం జరుగుతుందని చెప్పారు. మంగళవారం అమ్మవారికి బోనాలు, ప్రభబండ్లతో ఊరేగింపు, జాతర జరుగుతుందని, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
WGL: మిల్స్ కాలనీ PS పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. CI రమేష్ వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన నాగ్ భరత్ కుటుంబం అమ్మవారిపేటలోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. అయితే ఆయన కుమార్తె రూపాలి(15) రెండు రోజులుగా ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతోంది. కొంచం సమయం ఇవ్వాలని తల్లిదండ్రులు అడగగా మనస్తాపం చెంది ఉరివేసుకొని మృతి చెందింది.
BHPL: జిల్లాలోని గ్రామాల్లో అక్రమ గుడుంబా వ్యాపారం బహిరంగ రహస్యంగా కొనసాగుతోంది. దేవాలయాలు, పాఠశాలల సమీపంలోనే మద్యం అమ్మకాలు జరుగుతుండటం, తండాల నుంచి బైక్ల ద్వారా రోజువారీ సరఫరా జరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గుడుంబా మాఫియాపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బాధ్యులను చట్టా రీత్యాలు శిక్షించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
KMR: దోమకొండ మండల కేంద్రం నుంసీ ముత్యంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా కంకర తేలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీటీ రోడ్డు కోసం కంకర వేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
SDPT: పుల్లూరు బండ త్రికుటేశ్వరాలయంలో నేడు కోటి తలంబ్రాల దీక్ష చేపడుతున్నట్లు గజ్వేల్కు చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. భద్రాచల రామయ్య కళ్యాణానికి గోటితో వడ్లు ఓలిచి అందించే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
SRD: జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పెద్దమ్మగూడెం చెందిన బంగారి రాజు (24) వ్యవసాయ పొలం వద్ద ఉన్న మత్తడిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. తండ్రి ముత్యాలు, స్థానికులు వెతికి మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
GDWL: జిల్లాలో బాలికలపై అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏకంగా 14 పోక్సో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా పాఠశాల వద్ద బైక్పై దింపుతామని నమ్మించి విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. బాలల భద్రత అందరి బాధ్యతని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
VKB: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:40 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు జిల్లాకు చేరుకుంటారు. అనంతరం అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ నిర్వహించనున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సాయంత్రం 4:20 వరకు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు వీరికి స్వాగతం పలకనున్నారు.
SRPT: ముస్లింల రంజాన్ ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ కుసుమ ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్జంగ్ పేటలో విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్ బాలేమియా నివాసంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఆమె ప్రారంభించారు. ఇఫ్తార్ విందులు ఇవ్వడం పుణ్యకార్యమని ఆమె పేర్కొన్నారు.
SRCL: వేములవాడ మున్సిపాలిటీలో నూతనంగా విలీనమైన శాత్రాజుపల్లి గ్రామం 2వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డికి గౌడ సంఘం, రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించి, పూలమాలలతో అభినందించారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తెలిపారు.
MNCL: పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వద్ద రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని తాండూర్ మండల విద్యుత్ AE జాన్ ప్రకటనలో సూచించారు. ఇటీవల ట్రాన్స్ ఫార్మర్లోని విలువైన రాగి తీగ, అల్యుమినియం దొంగలించే ముఠాలు ఎక్కువయ్యాయన్నారు. పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాయన్నారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద గస్తీ కాయడం, CC కెమెరాల ఏర్పాట్లు లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
MHBD: హోలీ పండుగ వేళ జిల్లాలో బాటసారులు, వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఈనెల 3న హోలీ నేపథ్యంలో మహిళలు, చిన్నపిల్లలు ప్రధాన రహదారులు, గ్రామాల్లోని రోడ్లపై ముళ్లచెట్లు, బండరాళ్లను రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై ముళ్ళ చెట్లు, బండరాళ్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
PDPL: గోదావరిఖని సింగరేణి స్టేడియం సమీపంలో సంస్థ ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ పంపు ఎప్పుడు వస్తుందో తెలియదు. క్యాన్లు, బిందెలు పట్టుకొని రావడం, తిరిగి వెళ్లడం జరుగుతుంది. బాగు చేయాలని కోరుతున్నారు.
SRD: పటాన్ చెరులో భర్త భార్య, కొడుకుపై కత్తితో దాడి చేశాడు. మామిడిపల్లికి చెందిన ఆనందరావు ముత్తంగి శ్రీనివాసరెడ్డి కాలనీలో నివసిస్తున్నాడు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు. ఫిబ్రవరి 24న మద్యం మత్తులో వచ్చి భార్య కవిత, అడ్డుకున్న కుమారుడు ధీరజ్పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD శివారు నారపల్లిలో CPRI ప్రాంతీయ కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కేంద్రం ద్వారా విద్యుత్ పరికరాల పరీక్షలు, క్వాలిటీ సర్టిఫికేషన్, షార్ట్ సర్క్యూట్ పరీక్షలు, మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ వంటి సామగ్రి నాణ్యత నిర్ధారణ జరుగుతాయి. విద్యుత్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసే ముందు CPRI టెస్ట్ చేస్తుంది.