BDK: జూలూరుపాడు మండలం పెద్ద హరిజన వాడ గ్రామస్తులు భక్తిభావంతో రామనామ స్మరణతో భద్రాచలం వైపు తమ పవిత్ర పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. భక్తులు గత నెల రోజులుగా అత్యంత నియమ నిష్టలతో, కఠిన ఉపవాసాలతో సిద్ధం చేసుకున్న ఒలిచిన గోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్య చెంతకు సమర్పించనున్నారు. భక్తులు సంప్రదాయక నారింజ, పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్లారు.